- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పిడుగు పాటుకు ఓ యువకుడితో పాటు నాలుగు ఎద్దులు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతం చెల్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు తన వ్యవసాయ క్షేత్రంలో బుచ్చిరెడ్డి మరణించాడు. వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో రెండు ఎద్దులు, కామరెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతం మంగళూరులో మరో రెండు ఎద్దులు చనిపోయాయని అధికారులు వెల్లడించారు. సదరు రైతులకు పరిహారం ఇప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతి చెందిన రైతు బుచ్చిరెడ్డికి రైతు బీమా వర్తింపజేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
One person, Four oxes dead with Lightening
- Advertisement -