- Advertisement -
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ చోటుచేసుకున్న సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగింది. ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇద్దరు రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను తరిమి కొట్టారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
Gang war between two groups at oldcity in Hyderabad
- Advertisement -