హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అయింది. దీంతో దేశవ్యాప్తంగా ల్యాప్టాప్, డెస్క్టాప్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి కంపెనీలు డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులతో ముందుకొచ్చాయి. హెచ్పి, డెల్, లెనోవో, ఏసర్, ఆసుస్ కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయని హైదరాబాద్లోని ఖైరతాబాద్లో మల్టీ బ్రాండ్ షోరూం ఐటి మాల్ ఎండి మొహమ్మద్ అహ్మద్ తెలిపారు.
అలాగే స్క్రాచ్కార్డ్తో మొబైల్, ట్యాబ్లెట్ వంటి బహుమతులు, రూ.50,000 వరకు క్యాష్బ్యాక్, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్ కూడా అందుకోవచ్చని తెలిపారు. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్స్టిట్యూషనల్ కస్టమర్లకు డెస్క్టాప్, ల్యాప్టాప్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. యాక్సెసరీస్పై 25 శాతం దాకా తగ్గింపును అందిస్తున్నారు.