- Advertisement -
హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్తోనే సంగారెడ్డి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలను మోసం చేసి గెలిచిన జగ్గారెడ్డి ప్రెస్మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. సంగారెడ్డిని మున్సిపాలిటీని అభివృద్ధికి మోడల్గా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, మాజీ ఎంఎల్ఎ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
- Advertisement -