Saturday, April 27, 2024

భార్య చితిలో భర్త దూకి…. ఆపై బావిలో దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Husband jump into wife's pyre after suicide

ముంబయి: భర్త తన భార్య చితిలో దూకి అనంతరం భావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గొండిపిప్రి ప్రాంతంలోని భంగ్రామ్ తాలోధి గ్రామంలో రుచిత చిత్తవార్ అనే అమ్మాయి చంద్రపూర్ ప్రాంతానికి చెందిన కిషోర్ ఖటిక్‌ను పెళ్లి చేసుకుంది. ఆర్‌టిఒ ఆఫీస్ పక్కన గల డ్రైవింగ్ ట్రైయినింగ్ సెంటర్‌లో కిషోర్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. కిషోర్-రుచిత అనే దంపతులు అన్యోనంగా జీవిస్తున్నారు. మూడు నెలల గర్భవతి ఐనా రుచిత తన మేనమామ ఇంటికి వెళ్లింది. కిషోర్ తన భార్య తీసుకోపోవడానికి భంగ్రామ్ గ్రామానికి వచ్చాడు. రుచిత కనిపించడంలేదని అత్తగారు కుటుంబ సభ్యులు కిషోర్‌కు తెలిపారు. ఆమె కోసం వెతకగా ఒక బావిలో మృతదేహంగా కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రుచిత చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికిలో చితిపై పెట్టి నిప్పంటించారు. శ్మశాన వాటిక నుంచి బంధువులు, భర్త కిషోర్ తిరిగి ఇంటికి వెళ్తుండగా భర్త వెనకకు తిరుగొచ్చి భార్య చితిపై దూకాడు. బంధువులు అతి కష్టం మీద అతడిని చితి (కాష్టం) నుంచి బయటకు తీశారు. అక్కడ కూడా బంధువుల నుంచి తప్పించుకొని దగ్గరలోని బావిలో దూకాడు. బావిలో నుంచి అతడిని తీయడానికి బంధువులు తాళ్లు విసిరారు. అతడు అవి పట్టుకోకుండా తనకు తాను నీళ్లలో మునిగి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదావశాత్తు మరణించాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య మరణం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. భార్య ఆత్మహత్యకు ఇంకా కారణాలు తెలియడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News