Friday, May 10, 2024

ఎపిలో కొత్తగా 462 పాజిటీవ్ కేసులు.. ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

269 New Corona Cases Reported in Telangana

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా విజృంభిస్తుండడంతో ప్రతీ రోజూ దాదాపు ఐదు వందల పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 462 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రలోని 407 మందికి కరోనా సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 40 మందికి పాజిటీవ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన మరో 15 మందికి కరోనా సోకింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా కసుల సంఖ్య 9,83కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 5,123 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.ఇక, కరోనా వైరస్ నుంచి 4,593 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

462 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News