Tuesday, April 30, 2024

అర్థరాత్రి రోడ్డుప్రమాదం: ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

five pawan kalyan fans died in road accident at warangal

వరంగల్: ఐదుగురు యువకులు ఘోరమైన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొంది. ఐదుగురు స్నేహితులు ఓ వేడుక కోసం వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో మృత్యువు వారిని కబళించడంతో ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాలు స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ పట్టణంలోని పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన మేకల ప్రవీన్, మేకల రాకేష్, మేడి పవన్, హన్మకొండ నయీంనగర్ ప్రాంతానికి చెందిన రోహిత్, నర్సంపేట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షబ్బీర్‌లు ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పరకాలకు వెళ్తుండగా వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని దామెర మండల పరిధిలోని పసరగొండ క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. కాళేశ్వరం నుండి ఇసుకలోడ్‌తో వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు పసరగొండ క్రాస్‌రోడ్డు వద్ద కారు ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న రాకేష్, పవన్, ప్రవీన్, రోహిత్, షబ్బీర్‌లు అక్కడిక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు.

 వెంటనే స్పందించిన పోలీసులు..

జాతీయరహదారిపై వెళ్తున్న వారు చూసి పరకాల పోలీసులకు సమాచారం అందించడంతో పరకాల ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే యువకులు ఐదుగురు మృతిచెందారు. స్పందించిన పోలీసులు వెంటనే కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వారిని గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువకులంతా పాతికేళ్లలోపు ఉండడం అందరిని విషాదంలోకి నెట్టింది.

– ప్రాణాలు తీసిన ఫంక్షన్..

ఓ సినిహీరో పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు పరకాలలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు యువకులు ఐదుగురు కారులో తెల్లవారు జామున బయలుదేరారని స్థానికులు తెలిపారు. సిని హీరో జన్మదిన వేడుకలకు వెళ్తూ ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో సమాచారం అందుకున్న ఐదుగురి యువకుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి.

– అతివేగమే ప్రాణాలు తీసిందా..?

పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలనే ఆత్రుతలో యువకులు అతివేగంగా వెళ్తూ మృత్యువాత పడ్డారని తెలిసింది. కారులో ఐదుగురు యువకులు వరంగల్ నుండి బయలుదేరి జాతీయ రహదారిపైకి చేరుకున్న తరువాత అతివేగంతో వెళ్తూ పసరగొండ క్రాస్‌రోడ్డు సమీపంలో ముందువెళ్తున్న ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయి తమ కారును ఎదురుగా వస్తున్న ఇసుక లోడ్ లారీని ఢీ కొట్టారని అతివేగంతో యువకులు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. లారీ ఢీ కొన్న కారు నుజ్జునుజ్జయి లారీ కింది భాగంలో చొచ్చుకుపోవడంతో యువకులకు తీవ్రమైన గాయాలు సున్నితమైన భాగాల్లో తాకడంతో ఆకస్మిక మృత్యువాత పడ్డట్టు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరకాల ఎసిపి శ్రీనివాస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News