చెన్నై: అమ్మమ్మ, తండ్రి కలిసి బతికి ఉన్న పసికందు నిప్పంటించి చంపిన సంఘటన తమిళనాడులో టెన్కాశి జిల్లాలోని శంకరణ్కోవిల్ టౌన్లో జరిగింది. రైల్వే ఫీడర్ కాలనీలో సగం కాలుతున్న పసికందు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి మూడు వందల మీటర్ల దూరం వెళ్లి శంకర్గోమతి(20) ఇంటి ముందర ఆగింది. పోలీసులు శంకర్ గోమతి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. శంకర్ గోమతి అనే యువతి స్థానికంగా ఉండే శంకర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె గర్భవతి అని తెలియగానే శంంకర్ రెండు సార్లు టాబ్లెట్లు ఇచ్చి అబార్షన్ చేయించడంలో విఫలమయ్యాడు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పండంటి బిడ్డకు గోమతి జన్మనిచ్చింది. గోమతి తల్లి ఇంద్ర ఆ బిడ్డను గుడ్డలో మడిచి పెట్టింది. రైల్వే ఫీడర్ రోడ్డులో పసికందును కిందపడేసి నిప్పటించింది. స్థానికుల సహాయంతో ఈ కేసును పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఇంద్ర, శంకర్పై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్పి జి సుగునా సింగ్ తెలిపాడు. శంకరాగోమతి అనారోగ్యం పాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అప్పుడే పుట్టిన పసికందుకు నిప్పంటించి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -