Tuesday, May 7, 2024

కేంద్రంపై రాహుల్ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi attacks Modi government

న్యూఢిల్లీ: కేంద్రప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌ళ్లీ విమ‌ర్శ‌లు గుప్పించారు. మోడీ ప్రభుత్వ ప్ర‌ణాళిక‌లతోనే దేశ జిడిపి ప‌డిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. కేంద్రం కరోనా వైరస్ ను సమ‌ర్థంగా ఎదుర్కోలేక పోతుందన్నారు.  క‌రోనాపై ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల‌ భార‌త జిడిపి24 శాతానికి ప‌డిపోయిన‌ట్టు రాహుల్ శనివారం ట్వీట్‌ చేశారు. దేశంలో 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవ‌డానికి కూడా కార‌ణం ఇదే అన్నారు. మోడీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్లే దేశంలో ప్ర‌తిరోజూ అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్న కేంద్రానికి, మీడియాకు మాత్రం అంతా స‌వ్యంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుందని రాహుల్ విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News