- Advertisement -
ముంబై: మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. పోలీస్ శాఖలో భారీగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 485 మంది పోలీసులకు కరోనా సోకగా.. వైరస్ తీవ్రతతో మరో పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మహారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్ లో ఇప్పటివరకు 18,890 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మొత్తం 186మంది పోలీసులు మరణించారు. ఇక, మహారాష్ట్రలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ప్రతీరోజూ 20 వేల కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనాతో 28వేలకు పైగా బాధితులు మృతి చెందారు.
485 Cops test positive for Corona in Maharashtra
- Advertisement -