Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 9,901 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

9901 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 76,465మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 9,901 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 67మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5,57,587కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,846మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 95,733మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,57,008మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 45,27,593 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

9901 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News