హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో జోరుగా వైరల్ అయింది. ఒక సినిమా షూటింగ్లో భాగంగా ముందు అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె కూడా కరోనా పరీక్ష చేయించుకుంది. కరోనా పరీక్ష కోసం పాయల్ ముక్కు నుండి శాంపిల్ తీస్తున్న సమయంలో ఆమె ఏడ్చింది. పైగా ఆ వీడియోను ఈ బ్యూటీ ఇన్స్టాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్స్ ఆమెను ఒక ఆట ఆడేసుకున్నారు. మరీ ఓవర్ యాక్షన్ చేశావు… ఇంజక్షన్ కు భయపడటంలో ఒక అర్థం ఉంది.
ముక్కు నుండి శాంపిల్ తీయడంలో ఏముంది… అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తన వీడియోకు పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. “నాకు డాక్టర్లు అన్నా.. సూదులు అన్నా కూడా చాలా భయం. ముక్కు నుండి శాంపిల్ తీసే సమయంలో నాకు నిజంగా చాలా భయం వేసింది. ఆ సమయంలో నాకు చాలా ఏడుపు వచ్చింది. దాన్ని కొం దరు ఫేక్ అనుకుంటున్నారు. దానికి నేను ఏమీ చేయలేను. నా భయంను ట్రోల్ చేయడం అన్యాయం.. దారుణం” అంటూ పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇంకా టైటిల్ ఖరారు కానీ ఓ సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్లో కూడా నటిస్తోందట.