హైదరాబాద్: ఐటెల్ సంస్థ అతి తక్కువ ధరలో.. అద్భుత ఫీచర్లతో కొత్త ఫోన్ ను ఐటి2192టి థర్మో ఎడిషన్ పేరుతో మార్కెట్ లో లాంచ్ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బాడీ టెంపరేచర్ ను గుర్తించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటెల్ సంస్థ ఓ కొత్త ఫోన్ ను విడుదల చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీని ధరను కేవలం రూ.1049గా నిర్ణయించింది. ఇన్ బిల్ట్ టెంపరేచర్ సెన్సార్ ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రతను మానిటర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. 4.5 సె.మీ డిస్ ప్లే,1000 ఎంఎహెచ్ బ్యాటరీతో 4 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఈ ఫోన్ 8 భారతీయ భాషలకు సపోర్టు చేస్తుందని ఐటెల్ పేర్కొంది. తమ వినియోగదారుల ఆరోగ్యం, వినోదం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ఎక్కువ బాధ్యత వహించేలా ఎంట్రీ లెవల్లో అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ను లాంచ్ చేసినట్టు ఐటెల్ సిఇఒ తలపాత్రా పేర్కొన్నారు.
ఐటెల్ అద్భుత ఫీచర్ల…
ఐటి2192టి థర్మో ఎడిషన్ 4.5 సెం.మీ డిస్ప్లే
1,000 ఎంఏహెచ్ బ్యాటరీ
సూపర్ బ్యాటరీ మోడ్తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్
ఈ కీప్యాడ్ ఫీచర్ ఫోన్లో వెనుక కెమెరా
రికార్డింగ్ ఆప్షన్తో వైర్లెస్ ఎఫ్ఎం, ఆటో కాల్ రికార్డర్
ఎల్ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్, వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.