దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో కూడా అర్ధ సెంచరీలు సాధించిన పుజారా తాజా ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో నిలిచాడు. మరోవైపు రెండో ఇన్నింగ్స్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ కూడా తన ర్యాంక్ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్కు చేరుకున్నాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ విరాట్ను వెనక్కి నెట్టి రెండో ర్యాంక్ను అందుకున్నాడు. మరోవైపు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె ఏడో ర్యాంక్ను కాపాడుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ కెప్టెన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్, బుమ్రాలు టాప్10లో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా స్టార్ కమిన్స్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా రెండో ర్యాంక్కు దూసుకెళ్లాడు.
ICC Test Rankings: Pujara moves up to no 8