- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాచెన్న గారి కమలాకర్రెడ్డి ఆధ్వరర్యంలో స్టోన్ క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని అరణ్యభవన్లో మంత్రి హరీశ్రావును మంగళవారం కలిశారు. ఈ నెలలో కొన్ని చోట్ల క్రషర్స్ లీజు గడువు ముగిసిందని, వాటిని తిరిగి రెన్యూవల్ చేయాలని కోరారు. స్థానికంగా కొన్ని చోట్ల పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని వాటిని పరిష్కరించాలని కోరారు. స్టోన్ క్రషర్ల నుంచి ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీని తొలగించాలని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమ క్రషర్స్ వల్ల ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని తమ సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హరీశ్రావు చెప్పారు.
- Advertisement -