Monday, May 20, 2024

ఐదో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యత

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో ఐదో రౌండ్‌ లెక్కింపు పూర్తయింది. మొదటి నాలుగు రౌండ్లలో ముందంజలో ఉన్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఐదో రౌండ్‌లోనూ ఆధిక్యతను ప్రదర్శించారు. ఐదో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,897 ఓట్లు పోలవ్వగా సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12,560, తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్‌ కొదండరాంకు 9,585, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 5,288, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4,340 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 3,058. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 18,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదు రౌండ్ల కౌంటింగ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 79,113 ఓట్లు పోలవ్వగా, తీన్మార్‌ మల్లన్నకు 60,564, ప్రొఫెసర్‌ కోదండరాంకు 49,200, ప్రేమేందర్‌రెడ్డికి 28,991, రాములు నాయక్‌కు 20,274 ఓట్లు పోలయ్యాయి. 6906 ఓట్లతో జయసారది రెడ్డి ఆరో స్థానంలో, 6828 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఎడో స్థానంలో,5764 ఓట్లతో రాణి రుద్రమ రెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News