- Advertisement -
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కు మంచి ఆరంభం లభించినా వెంటవెంటనే ముగ్గురు కీలక ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. మంచి షాట్లతో ఆలరించిన రోహిత్ శర్మ (37) పరుగుల వద్ద రషీద్ బౌలింగ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో మంచి పామ్ లో ఉన్న శిఖర్ ధవన్(67)ను రషీదే వెనక్కి పంపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి మోయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (27), కెఎల్ రాహుల్(05) క్రీజులో ఉన్నారు.
India vs England 3rd ODI Live Score
- Advertisement -