Tuesday, April 30, 2024

భార్య చేతిలో భర్త హత్య.. తాగి వేధించినందుకే

- Advertisement -
- Advertisement -

Husband murdered at wife's hands at bodhan

తాగి వేధించినందుకే హత్య

బోధన్: కట్టుకున్నోడి వేధింపులు భరించలేక గొంతుకు వైర్‌తో ఉరి వేసి భర్తను హత్య చేసిన సంఘటన రుద్రూర్ మండలంలోని రాణంపల్లిలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్‌ఐ రవీందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ అలీ అనే 34 ఏళ్ల వ్యక్తి సుమారు 15 ఏళ్ళ క్రితం బోధన్ నుండి రాణంపల్లి గ్రామానికి చెందిన అనిపా బేగం 28 అనే మహిళలకు ఇల్లరికం అల్లుడిగా వచ్చాడు. నాటి నుండి తరచే తాగి వేధింపులకు గురిచేస్తుండడంతో పలు మార్లు పెద్దలతో బెదిరించారు. ఎంతకు తీరు మార్చు కోక తాగిన మైకంలో భార్యను చిత్ర హింసలకు గురి చేస్తుండడంతో పాటు కొట్టే వాడని పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి సైతం తాగి వచ్చి కొట్టడంతో భార్య అనిపా బేగం అత్త అహమ్మ దిబీలు కలిసి డిష్ వైర్‌ను మెడకు బిగించి ఉరి వేసి అలీని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న రుద్రూర్ ఎస్ ఐ సంఘటన స్థలానికి చేరుకుని హత్య ఘటనపై ఆరా తీశారు. అనంతరం సిఐకి సమాచారం అందించడంతో రాణంపల్లి కి చేరుకున్న సిఐ అశోక్ రెడ్డి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానితులు గా భావిస్తున్న అహ్మదీ బీ , అనిపా బేగం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వాస్తవాలను తల్లి కూతుళ్లు వెల్లడించారని తరచు తాగి వచ్చి వేధించే వాడని వేధింపులు భరించలేకనే తాము హత్మ చేశామని వెల్లడించినట్లు సిఐ వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన వెను వెంటనే రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News