- Advertisement -
భువనేశ్వర్: మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం చేసిన సంఘటన ఒడిశాలోని బాలేశ్వరం జిల్లా గోపాల్ పూర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాస్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలనుకు తరలించేందుకు గోపాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో అదనపు సిబ్బందిని నియమించారు. మహిళా కానిస్టేబుల్ పై అక్కడి విధుల నిర్వహిస్తున్న ఎస్ఐ బన్సీధర్ ప్రధాన్ అత్యాచారం చేశాడు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ పి సుధాంశు శేఖర్ తెలిపాడు. ఎస్ఐని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
- Advertisement -