- Advertisement -
ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో ఓ నైజీరియన్ను అరెస్ట్ చేసినట్టు మాదకద్రవ్యాల నియంత్రణబ్యూరో(ఎన్సిబి) అధికారి వెల్లడించారు. కొకైన్తో పట్టుబడ్డ నైజీరియన్ను ఒకారో ఓవుజామాగా గుర్తించామని ఆయన తెలిపారు. దీంతో,ఈ కేసులో అరెస్టయిన 20మందిలో నైజీరియాకు చెందినవారి సంఖ్య రెండుకు చేరింది. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను ఎన్సిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయినవారిని విచారించడం ద్వారా విదేశీ లింకులు బయటపడుతున్నాయని ఎన్సిబి అధికారి తెలిపారు.
- Advertisement -