Tuesday, May 7, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కార్తీక మాసం మొదటి రెండో సోమవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. స్వామివారి ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Huge devotees visit Rajanna Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News