Wednesday, May 15, 2024

బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీపార్వతి

- Advertisement -
- Advertisement -

Do not believe ChandraBabu's words: Lakshmi Parvati

 

మనతెలంగాణ/హైదరాబాడ్ : దివంగత ఎన్‌టిఆర్‌ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని ఎపి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. ఎన్‌టిఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.ఆ మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, బాబు మాటలు నమ్మవద్దని హితవు పలికారు. మీ నాన్నగారి విషయంలో చంద్రబాబు ఒక్క నిజం కూడా చెప్పలేదని, ఎన్‌టిఆర్ ఎపిసోడ్‌లోనూ భువనేశ్వరి, పురందేశ్వరి బాలకృష్ణ మనసు మార్చారని పేర్కొన్నారు. సీఎం పదవి కోసం భార్యపై నిందలు వేసుకుంటాడా అని , సానుభూతి సంపాదించుకునేందుకు భార్య పేరు వాడుకుంటాడా అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News