Sunday, May 19, 2024

స్పీకర్ పోచారంను మర్యాదపూర్వకంగా కలిసిన గోవా ప్రతినిధుల బృందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా గోవా శాసనసభ స్పీకర్ రాజేష్ పట్నేకర్ నేతృత్వంలోని ఆరుగురు మాజీ శాసనసభ్యులు, అధికారుల నేతృత్వంలోని సభ్యుల బృందం కలిసింది. అధికారిక స్టడీ టూర్‌లో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన గోవా బృందం ముందుగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని అధికారిక నివాసంలో కలిశారు. ఈసందర్భంగా రాష్ట్ర శాసనసభ పనితీరును, ప్రత్యేకతలను గోవా బృందానికి స్పీకర్ పోచారం వివరించారు. రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News