Tuesday, May 7, 2024

30 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఇదే చివరి సారి…ఇకపై పొడిగింపు ఉండదు :
స్పష్టం చేసిన ఇంటర్ బోర్డు

TS inter 1st year admission last date extended

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మళ్లీ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 30 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ గడువు ఆగస్టు 30 వరకు ఉండగా, దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబరు 30 వరకు, ఆ తర్వాత నవంబర్ 12 వరకు పొడిగించారు. తాజాగా ఈ నెల 30 వరకు ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే ఇదే చివరి సారి అని.. ఇకపై పొడిగించమని బోర్డు స్పష్టం చేసింది. పెండింగ్‌లో ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఈ నెల 30లోగా ప్రవేశాల ప్రక్రియను ముగించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News