Friday, May 3, 2024

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

- Advertisement -
- Advertisement -

Anointing to paint CM KCR in Peddapalli

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులందరికీ రైతు బంధు విడుదల చేసినందుకు సిఎం కెసిఆర్ చిత్రపటానికి టిఆర్‌ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు (పంట సాయం) చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఉప్పు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో రైతులు ఇబ్బం దులు పడొద్దని వారిని దృష్టిలో ఉంచుకుని సిఎం కెసిఆర్ రైతులకు అండగా ఉండాలని, వారు పంట సాయం కొరకు ఎవరి వద్దకు వెళ్లొద్దని ప్రతి సంవత్సరం లాగే ఈ సారి రైతుబంధు నగదు బ్యాంకులలో జమ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ సిఎం కెసిఆర్ వెంటే ఉండాలని మమ్ములను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News