Thursday, May 2, 2024

పడవ ప్రమాదం:10 విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పడవ ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందిన సంఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిసిన కథనం ప్రకారం ఖైబర్ ప్రంకుత్త ప్రావెన్సీ లోని ఓ పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులు విహరయాత్ర లో భాగంగా పడవలో బయలు దేరారు. మార్గ మద్యలో పడవ ప్రమాదం జరగడంతో 10 విద్యార్థులు జల సమాది అయ్యారు. మృతి చెందిన విద్యార్థులంతా 11 నుంచి 13 ఏళ్ల వయసులోపే వారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న సహాయక బృందాలు ఆరుగురు విద్యార్థులను రక్షించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గల్లంతైన 9 మంది విద్యార్థుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి పడవ ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News