Friday, September 19, 2025

ప్రాణం తీసిన బిసి బంధు

- Advertisement -
- Advertisement -

మెదక్: బిసి బంధు విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో మనస్థాపంతో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్న శంకరంపేటలో కుమ్మరి(35), ముత్యాలు(40) అనే అన్నదమ్ములు నివసిస్తున్ననారు. ఇద్దరు బిసి బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండడంతో స్థానిక రాజకీయ నాయకులు ముత్యాలు ఎంపిక చేసి ఇద్దరు చేరి సగం తీసుకోవాలని సూచించారు. సగం తమ్ముడికి ఇచ్చేందుకు ముత్యాలు అంగీకరించాడు. శంకర్ మాత్రం మొత్తం ఇవ్వాలని లేకుంటే మొత్తం తీసుకోవాలని సూచించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భార్య, పిల్లలు నిద్రపోయాక ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఐఫోన్ నకిలీ విడిభాగాల విక్రయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News