Wednesday, April 30, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్‌లో వేచివున్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని  52,643 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. శనివారం మలయప్పస్వామికి పుష్పార్చన చేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఆర్జిత సేవలను రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News