హోమ్ టెక్సటైల్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైన, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ వెల్స్పన్ వరల్డ్లో భాగమైన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యుఎల్ఎల్), టెక్సటైల్ రంగంలో ఆపరేటర్ స్థాయి ఉద్యోగాలపై దృష్టి సారించి పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి , ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (NSDC)తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది . నైపుణ్య అంతరాల సమస్యను అధిగమించటానికి , ఉపాధి అవకాశాలను పెంచడానికి, పరిశ్రమ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ఈ భాగస్వామ్యం సహాయపడుతుంది.
కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖల మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌదరి మరియు మిజోరం ముఖ్యమంత్రి పు లాల్దుహోమా సంయుక్తంగా ఈ పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిజోరం ప్రభుత్వ కార్మిక, ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ లాల్న్ఘింగ్లోవా హ్మర్ ; మిజోరాం ప్రభుత్వ హోం శాఖామాత్యులు శ్రీ కె. సప్దంగా; నాగాలాండ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, కార్మిక & ఎక్సైజ్ శాఖల సలహాదారు శ్రీ మాతోషి లాంగ్కుమెర్; భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి , ఆర్థిక సలహాదారు శ్రీమతి జి. మధుమిత దాస్; మరియు ఎంఎస్ డి ఈ సంయుక్త కార్యదర్శి శ్రీ శ్రీశైల్ మాల్గే సహా కీలక ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. వెల్స్పన్ మరియు NSDC ల సంయుక్త ప్రయత్నాన్ని వారు ప్రశంసించారు. ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలను సృష్టించడంలో మరియు నైపుణ్యాలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ కాలంలో శిక్షణ పొందినవారికి శిక్షణ, ప్రయాణం , స్టైపెండ్ల రూపేణా సుమారుగా రూ. 42,500 ఖర్చు కానుంది. ఈ కార్యక్రమానికి మొత్తం పెట్టుబడి రూ. 4.25 కోట్లు. ఈ భాగస్వామ్యంలో భాగంగా పైలట్ దశలో 1,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం తో పాటుగా ధ్రువీకరణ పత్రాలు అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తరాఖండ్ వంటి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల నుండి కనీసం 50% మహిళలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం భారతదేశ టెక్సటైల్ తయారీ రంగానికి స్థిరమైన రీతిలో ప్రతిభావంతులను తీర్చిదిద్దటానికి రూపొందించబడింది, అదే సమయంలో లింగ మరియు ప్రాంతీయ సమానత్వాన్ని ముందుకూ తీసుకు వెళ్లనుంది.
ఈ కార్యక్రమం గుజరాత్లోని అంజార్ మరియు వాపిలోని వెల్స్పన్ యొక్క అత్యాధునిక సౌకర్యాలలో నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా… :
• 120 గంటల తరగతి గది ఆధారిత శిక్షణ
• 210 గంటల ఉద్యోగ శిక్షణ (OJT).
• అభ్యర్థులకు యంత్ర నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియలు, నాణ్యత నియంత్రణ, భద్రతా మార్గదర్శకాలు, సాఫ్ట్ స్కిల్స్ వంటి కీలక సాంకేతిక రంగాలలో శిక్షణ ఇవ్వబడుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన తర్వాత, శిక్షణార్థులందరూ NSDC మరియు వెల్స్పన్ నుండి ఉమ్మడి ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారు. వెల్స్పన్ వస్త్ర కార్యకలాపాలలో క్యాప్టివ్ ఉపాధికి హామీ ఇవ్వబడుతుంది.
“వెల్స్పన్ వద్ద , మహిళలు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు, భారతదేశ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తును రూపొందించడంలో శక్తివంతమైన ఉత్ప్రేరకాలు అని మేము విశ్వసిస్తున్నాము” అని వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా అన్నారు. “ఈ భాగస్వామ్యం సమ్మిళిత మరియు స్థిరమైన వృద్ధికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈశాన్య & ఉత్తరాఖండ్ రాష్ట్రాల మహిళలపై దృష్టి సారించడం ద్వారా, మేము నైపుణ్య అంతరాలను తగ్గించడమే కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ-విలువ మరియు తరాల ప్రభావానికి మార్గాలను తెరుస్తున్నాము ” అని అన్నారు.
వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రాజేష్ జైన్ మాట్లాడుతూ, “నైపుణ్యాభివృద్ధి అనేది ఉపాధి గురించి మాత్రమే కాదు, అవకాశాలను సృష్టించడం మరియు వారి భవిష్యత్తును మార్చగల సామర్థ్యంతో ప్రజలను శక్తివంతం చేయడం గురించి. NSDCతో మా భాగస్వామ్యం ద్వారా, మేము మరింత సమ్మిళిత , భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వస్త్ర శ్రామిక శక్తిని సృష్టించడం మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి దోహదపడటం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
ఈ కార్యక్రమం వెల్స్పన్ యొక్క LITE సిద్దాంతం -అభ్యాసం, ఆవిష్కరణ, నమ్మకం/ప్రతిభ మరియు ఓర్పును ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, కంపెనీ తమ 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని “ది అన్స్టాపబుల్ W” అనే నేపథ్యంతో, సమ్మిళిత వృద్ధి స్ఫూర్తిని జరుపుకుంది. భవిష్యత్తులో టెక్సటైల్ రంగంలో అభివృద్ధి చెందడానికి వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను సన్నద్ధం చేయడమనే లక్ష్యం ఆధారంగా నైపుణ్య భాగస్వామ్యం రూపొందించబడింది.