ఈ ఏడాది జరిగిన zగ్ (IPL 2025) సర్వత్ర ఆసక్తికరంగా సాగింది. దాదాపు అన్ని మ్యాచ్లు ఉత్కంఠగా జరిగాయి. సిరీస్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేసన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టివి మరియు డిజిటల్ ప్రసారకులు జియో హాట్స్టార్ వెల్లడించింది. టివి, డిజిటల్ వ్యూయర్షిప్లో ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం.
టివి వ్యూయర్షిప్లో అత్యధిక రీచ్ (169 మిలియన్ వీక్షకులు, 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టి-20 మ్యాచ్గా ఇది ప్రపంచరికార్డు సాధించింది. జియో హాట్స్టార్లోనూ ఈ మ్యాచ్ చరిత్రను తిరగరాసింది. 892 బిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమషాల వీక్షణ సమయంతో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డు సాధించింది. సీజన్ మొత్తం కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ సాధించింది. కాగా, జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగి ఐపిఎల్ ఫైనల్స్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 పరుగుల తేడాతో ఆర్సిబి గెలిచి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.