- Advertisement -
హైదరాబాద్: సీనియర్ నేతగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కొండా మురళి వ్యాఖ్యలపై హైకమాండ్ (High command Murali comments) కు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ విషయంపై అధిష్టానం ఆలోచన చేయాలని చెప్పారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అని హెచ్చరించారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. మీ పాపాలు కులాన్ని అడ్డుపెట్టుకుంటే పోతాయా? అని నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.
- Advertisement -