Friday, September 19, 2025

నిర్మల్ జిల్లాలో పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ ను కత్తితో పొడిచిన దుండగుడు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ అడ్డుకున్నాడు. అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో నిందితుడు పొడిచాడు. అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి ప్రయత్నించగా బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలయ్యాయి. వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో నిందితుడు పారిపోయాడు. గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ విలవిల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News