- Advertisement -
తిరుపతి: తనని కరిచిందిని పాము తలను మందుబాబు కొరికి ఇంటికి తీసుకెళ్లి పడుకున్నాడు. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో జరిగింది. చియ్యంవరం గ్రామంలో వెంకటేష్ అనే మందు బాబు మద్యం పుల్ గా తాగి ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ ను నల్ల త్రాచుపాము కరిచింది. వెంటనే పామును పట్టుకొని తలను కొరికేశాడు. అనంతరం పాముతో సహా ఇంటికెళ్లి నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆస్పత్రికి తరలించారు.
Also Read: దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమం
.
- Advertisement -