దంతెవాడ: మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోలు నెమ్మదిగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) బుధవారం దంతెవాడ జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ ఎదుట ఏకంగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజి సుందర్రాజ్ తెలిపారు.
లొంగిపోయిన మావోలు గతంలో అనేక విధ్వంసక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఐజి పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక (Chhattisgarh)అధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే తమ ఉద్దేశమని.. జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశఆలు కల్పిస్తామన్నారు.
Also Read : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి