పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజి’ శుక్రవారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ ష్మి విలన్గా నటిస్తుండగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండు కలిసి ఉంటాయి. నా పాత్ర ప్రభావం చాలా భారీగా ఉంటుంది. సినిమాలో నేను పూర్తిగా మేకప్ లేకుండా నటించాను. అది సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఆలోచన. ఆయన పాత్ర సహజంగా కనిపించాలని కోరుకున్నారు. నాకూ అదే విజన్ ఉండటంతో ఎంతో సంతోషంగా ఆ నిర్ణయాన్ని అంగీకరించాను” అని శ్రియా రెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ.. “పవన్కళ్యాణ్ మాటలు తక్కువే మాట్లాడుతారు. నేనూ అలానే ఉంటాను. రాజకీయ పనులను పక్కనబెట్టి ఆయన షూటింగ్కి వస్తున్నారని నాకు తెలుసు. అందుకే ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. అయితే సెట్లో సినిమాకి సంబంధం లేని ఎన్నో విషయాలు మేము చర్చించుకున్నాం” అని శ్రియా రెడ్డి చెప్పారు.
భావోద్వేగాలు, శక్తి కలిసిన పాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -