హైదరాబాద్: మనుషులకు ఆధార్ కార్డు లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూభారతి చట్టం( Land Act) తీసుకొచ్చామని అన్నారు. ఖమ్మం జిల్లా- ఎర్రుపాలెం సదస్సుకు మంత్రులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల సదస్సులో మాట్లాడుతూ.. కంప్యూటర్ లో భూధార్ నంబర్ కొట్టగానే అన్నివివరాలు వస్తాయని, లైసెన్స్ డ్ సర్వేయర్లను (Licensed surveyors) నియమించి భూములను సర్వే చేయిస్తామని చెప్పారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3500 మంది రెవెన్యూ అధికారులను నిమమిస్తున్నామని, రెవెన్యూ అధికారులు గ్రామాల్లోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. భూమి సమస్యలకు పరిష్కారాలు అభించక పదేళ్లపాటు రైతులు ఇబ్బంది పడ్డారని తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.
భూధార్ నంబర్ కొట్టగానే అన్నివివరాలు వస్తాయి: తుమ్మల
- Advertisement -
- Advertisement -
- Advertisement -