Thursday, May 2, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ భార్యకు చికిత్స చేయించేందుకు బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం, తదుపరి విచారణ ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని వెల్లడించింది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని అభిషేక్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అతడు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2022 నవంబర్ 13వ తేదీన అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 19 నెలలుగా జైలులో ఉన్న అతడికి తాజాగా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయని, వాటి పంపిణీలో బోయినపల్లి అభిషేక్ కీలక పాత్రధారి అని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గతంలోనే తేల్చేసింది. దక్షిణాది సిండికేట్ నుంచి వచ్చిన మొత్తాన్ని సమకూర్చడంలో, పంపిణీకి ప్రణాళిక వేసిన వారిలో విజయ్‌నాయర్ కీలకమని పేర్కొన్న ఇడి,

ఆ మొత్తంలో అభిషేక్ రూ.30 కోట్లు హవాలా రూపంలో తీసుకు రాగా, మిగతా సొమ్మును ఢిల్లీలో సర్దుబాటు చేశారని వెల్లడించింది. అభిషేక్ వ్యాపారాలకు సంబంధించి సిబిఐ, ఇడి ఇప్పటికే సమాచారం సేకరించాయి. ఆయనకు పలు సంస్థల్లో భాగస్వామ్యం ఉందని నిర్ధారించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్‌లోనూ అప్పట్లో సోదాలు నిర్వహిం చారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులతో వ్యాపార భాగస్వా మ్యం ఉందని, అతని తరఫున అభిషేక్ కీలకపాత్ర పోషించాడని బయటపడింది. దక్షిణాదికి చెందిన అనేక మద్యం సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహ రించి ముడుపులు కూడగట్టారని ఇడి వెల్లడించింది. మరోవైపు ఇదే కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ఇడి అరెస్ట్ చేసింది ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా, 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయ మూర్తి ఆదేశించారు.

సౌత్ గ్రూప్‌నకు చెందిన కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో రూ.100 కోట్లు సమర్పించడం సహా, రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు ఇడి కస్టడీ పిటిషన్‌లో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News