Tuesday, April 30, 2024

కరోనాతో చికిత్స పొందుతూ నిందితుడు పరార్

- Advertisement -
- Advertisement -

Accused escaped in corona hospital in ap

 

అమరావతి: మర్డర్ కేసులు నిందితుడి ఉన్న వ్యక్తికి కరోనా సోకడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రి నుంచి పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒంగోలు హిల్ కాలనీలో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేశారు. ఏప్రిల్ 19న పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో పులి శ్రీనివాసులు, జంగిపల్లి విజయ్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒంగోలులోని జిజిహెచ్‌కు తరలించి రెండో వార్డులో వారిని చికిత్స అందించారు. విజయ్ గురువారం రాత్రి 11.45 మూత్ర విసర్జన కోసమని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడా కిటికీ ఊచలు వంచి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విజయ్‌ది గుంటూరు జిల్లా యార్గగడ్డ ప్రాంతానికి చెందిన వాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News