Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన ఆషిమా….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి ఆషిమా నర్వాల్ మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా ఆషిమ నర్వాల్ మాట్లాడారు. పర్యవరణాన్ని కాపాడుకోవడం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. వాతావరణంలో మార్పులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చాలెంజ్ ఎంతగానో అవసరమని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆషిమా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన స్నేహితులు యశా వీరమంచి, వెంకట్రావ్, ప్రశాంత్ రెడ్డి, హర్షం గుర్రం కొండ నలుగురికి ఆషిమా నర్వాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News