Tuesday, April 30, 2024

అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబ సభ్యులకు కెటిఆర్ భరోసా..

- Advertisement -
- Advertisement -

Additional Collector Anjaiah family meet KTR 

కరోనాతో మరణించిన అడిషనల్ కలెక్టర్ అంజయ్య
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం
ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం
అంజయ్య కుటుంబ సభ్యులకు మంత్రి కెటిఆర్ భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామరావు తెలిపారు. మంగళవారం అంజయ్య కుటుంబ సభ్యులు ప్రగతి భవన్లో మంత్రి కెటిఆర్‌ను కలిశారు. అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆయన కుటుంబానికి తెలిపారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Additional Collector Anjaiah family meet KTR 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News