Tuesday, April 30, 2024

కాబూల్ నుంచి రెండు విమానాలు

- Advertisement -
- Advertisement -

Air India flight from Kabul leaves for Delhi

భారతీయుల తిరిగి రాక ఆరంభం

కాబూల్ : అఫ్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఎఐ 244 ఆదివారంసాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కాబూల్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన దశలో అక్కడి నుంచి భారతీయులు, దౌత్యసిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమానం ఇక్కడికి చేరుకుంది. అంతకు ముందు ఉదయం కాబూల్ నుంచి బయలుదేరిన మరో విమానం కాబూల్‌లో కల్లోల పరిస్థితితో గంట ఆలస్యంగా బయలుదేరి సురక్షితంగా ఢిల్లీకి చేరుకుందని అధికారులు తెలిపారు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం క్రమేపీ అఫ్ఘన్ అధికారుల నిర్వహణ నుంచి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోతాలిబన్లు వీటిని తమ అధీనంలోకి తీసుకుంటే ఇతర దేశాలకు వెళ్లే విమానాల ప్రయాణాలపై ఎటువంటి అడ్డంకులు కల్పిస్తారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికీ మరికొందరు భారతీయులు కాబూల్‌లోనే ఉన్నారు. వీరిని తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News