Monday, May 6, 2024

ఎయిర్ ఇండియా ప్రత్యేక 96 గంటల సేల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రత్యేక 96 గంటల సేల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా భవిష్యత్‌లో చేయబోయే టూర్‌లకు పర్యాటకులకు తక్కువ ధర ఆఫర్ అందిస్తోంది. దేశీయ మార్గాల్లో వన్‌వే అన్ని చార్జీలతో కలిపి ఎకానమి టికెట్ రేటు రూ.1,470 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ రూ.10,130 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News