Sunday, April 28, 2024

5.5కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ బంపర్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తమ నెట్ వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయంతో రీచార్జ్ చేయించుకోలేకపోతున్న తమ వినియోగదారులకు ఒకసారి రూ.49 రిచార్జ్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.మొత్తం 5.5కోట్ల మంది వినియోగదారులకు ఉచితంగా ఈ ఆఫర్ ను అందిస్తామని తెలిపింది. ఈ ప్లాన్‌ ద్వారా రూ.38 టాక్‌టైమ్‌, 100ఎంబీ డేటాను 28రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాదు, రూ.79 రీచార్జ్‌ తో రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. రెండు వారాల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ప్రయోజనాలను అందిచనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ప్రయోజనాలతో గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లు కరోనా పరిస్థితుల్లో ముఖ్యమైన సమాచారం పొందడానికి ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్‌ సంస్థ పేర్కొంది.

Airtel offer rs 49 recharge plan for free to 5.5 cr users

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News