Saturday, July 27, 2024

కొత్త చిత్రానికి ‘నాంది’ పలికిన అల్లరి నరేష్

- Advertisement -
- Advertisement -

 

అల్లరి నరేష్ హీరోగా ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.1గా విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హరీష్ శంకర్ క్లాప్‌నివ్వగా నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ “ఈ సినిమా ద్వారా నిర్మాతగా సతీష్, దర్శకుడిగా విజయ్ పరిచయమవుతున్నారు. ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతున్న క్రైమ్ డ్రామా ఇది. ఈ సినిమాలో నాది ఇంటెన్సివ్ క్యారెక్టర్. అందరూ కొత్తవారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిదవుతుంది”అని అన్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ – “ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది”అని చెప్పారు. నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “నరేష్ హీరోగా ‘నాంది’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది. అతను ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. జనవరి 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మార్చిలో షూటింగ్ పూర్తి చేసి ఈ సమ్మర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి పనిచేస్తున్న మాటల రచయిత అబ్బూరి రవి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సిద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, కథా రచయిత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవి ప్రసాద్, వినయ్ వర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Allari Naresh new movie Naandi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News