- Advertisement -
అమరావతి: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేశారని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala ramanaidu) మండిపడ్డారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. భూమిలిచ్చిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంతపాడిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా శిక్షార్హులు అని అన్నారు. దీనికి వైయస్ జగన్, భారతి కూడా బాధ్యత వహించాలని, ప్రజలు క్షమించరని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -