పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్లో అమితాబ్ బచ్చన్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు అమితాబ్ ఏకంగా 22 కోట్లు తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అమితాబ్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుందట. డేట్స్ ఎక్కువ కేటాయించాలి కాబట్టి.. అంత రెమ్యునరేషన్ను బిగ్ బి డిమాండ్ చేశాడట. అయితే ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందిన సైరా సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషించినా.. ఆ సినిమాలో ఆయన అసలు పారితోషికమే తీసుకోలేదు. కానీ ప్రభాస్ సినిమాకి మాత్రం 22 కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు. ఇక బాలీవుడ్లో మార్కెట్ కోసం హీరోయిన్గా దీపికా పదుకునేను తీసుకొని ఆమెకు కూడా భారీగానే ముట్టజెబుతున్నారు. పైగా ఈ సినిమాకి దీపిక పాత్ర చాలా ముఖ్యమైనదట.