Friday, May 3, 2024

రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి :వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పై గుర్తుతెలియని యువకుడి మృత దేహం మంగళవారం లభ్యమయింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైల్ నుండి జారి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

స్టేషన్ సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప ంచనామా నిర్వహించి మృత దేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News