Monday, May 6, 2024

ఎపిలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి 14 వరకూ ఎపిలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. కారోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎపి సర్కార్ మరో రెండు వారాలు కర్ఫ్యూని పొడిగించింది.

AP Govt Extends Night Curfew till Feb 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News