Friday, March 29, 2024

టిటిడి ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

టిటిడి ఈవో ధర్మారెడ్డికి ఎపి హైకోర్టు జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. టిటిడికి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.

హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో.. ముగ్గురు ఉద్యోగులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుచేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిశారు. ఉద్యోగులు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించింది. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News