Saturday, May 18, 2024

ఎపిలో మరో 1000 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 984 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,280మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో బాధితులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. తాజా కేసులతో ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 20,82,843కు చేరుకుంది. ఇక, కరోనా వైరస్ బారిన పడి 14,505మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 152 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 20,62,732మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 5,606 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

AP Reports 984 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News